యువకుడు అదృశ్యం

10 Jul, 2015 18:30 IST|Sakshi

శంషాబాద్ రూరల్ (రంగారెడ్డి) : జీతం డబ్బులు తీసుకొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువకుడు కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన శంషాబాద్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. హెడ్ కానిస్టేబుల్ ఖాజా మోయినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గౌలిపురాకు చెందిన బండ నరేష్(22) నాలుగు నెలల క్రితం మండల పరిధిలోని తొండుపల్లిలో ఉండే తన మేనమామ రాజు ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా హైదరాబాద్‌లోని బేగంపేట్ వెళ్లి జీతం డబ్బులు తీసుకువస్తానని చెప్పి జూన్ 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. నరేష్ కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోవడంతో శుక్రవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు