విషం తాగి యువకుడి ఆత్మహత్య

25 Aug, 2015 15:42 IST|Sakshi

కుంటాల (ఆదిలాబాద్) : కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాలలో మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కండెల రాజు(20) చదువు పూర్తై ఇంటి దగ్గరే ఉంటున్నాడు.

ఈ క్రమంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు