ప్రధాని దిష్టిబొమ్మ దహనం

22 Mar, 2016 17:46 IST|Sakshi

నల్గొండ జిల్లా: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు ధరలు పెంచడం దారుణమని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.

మరిన్ని వార్తలు