బైక్-బస్ ఢీ..ఇద్దరు యువకులు మృతి

14 Mar, 2015 23:38 IST|Sakshi

కరీంనగర్(సిరిసిల్ల): మండలంలోని తంగళ్లపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మృతులు బద్దెనపల్లికి చెందిన సర్పంచ్ కుమారుడు వంశీగా గుర్తింపు. అదే గ్రామానికి చెందిన వంశీ స్నేహితుడు రవిగా గుర్తించారు. పోలీసుల సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో బద్దెనపల్లి విషాదచాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు