రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

12 Jan, 2017 09:20 IST|Sakshi

గరిడేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట శివారులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్‌(19) బైక్‌పై గరిడేపల్లి వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలైన రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు