జననేతకు ఘన నివాళి

9 Jul, 2018 02:16 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

సాక్షి, నెట్‌వర్క్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకలను వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహానేత వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతాసాగర్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని చెరువుకట్ట ప్రాంతంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వినోభానగర్‌లోని స్ఫూర్తిజ్యోతి ఆశ్రమంలో అంధ విద్యార్థులతో కేక్‌ కట్‌ చేయించి, పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలు, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబ్‌నగర్‌లోని వైఎస్సార్‌ చౌరస్తాలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కరీంనగర్‌ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నగేశ్‌ కేక్‌ కట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోగె పద్మ, పెద్దపల్లి, జ్యోతినగర్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముల్కల గోవర్ధనశాస్త్రి కేక్‌ కట్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, జగిత్యాల జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కట్ట శివ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

సింగపూర్‌లో వైఎస్సార్‌ జయంతి..  
దివంగత సీఎం వైఎస్సార్‌ జయంతి వేడుకలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సింగపూర్‌ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పార్టీ సింగపూర్‌ కమిటీ కన్వీనర్లు బొమ్మరెడ్డి సినీవాసులరెడ్డి, దక్కత జయప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జగన్‌ పాదయాత్రకు మద్దతు తెలియజేస్తున్నామని, 2019 ఎన్నికలకు ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు