వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు

11 Jul, 2015 03:06 IST|Sakshi
వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు

పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి ఆధ్వర్యంలో...
ఎర్రుపాలెం :
మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ మండల నాయకులు వేమిరెడ్డి మల్లారెడ్డి, శీలం జనార్దన్‌రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముస్లిం, హిందువుల మత సామరస్యానికి రంజాన్ దీక్షలు ప్రతీక అని అన్నారు. ఇలాంటి పర్వదినాల సందర్భంగా మతసామరస్యం పెంపొందుతుందని చెప్పారు. కార్యక్రమంలో మసీదు పీష్మా షేక్ షంషుద్దీన్,  వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లక్కిరెడ్డి నర్సిరెడ్డి, నాయకులు గుర్రాల పుల్లారెడ్డి, షేక్ హుస్సేన్, దేవరకొండ భూషణం, పోతురాజు కొండ, దేవరకొండ రవి, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు