పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన

15 Mar, 2016 18:05 IST|Sakshi

ఖమ్మం:  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేయడంతో పాటు మణుగూరు మండలంలో దీపం పథకం కింద 847 మంది లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు