ఆశావర్కర్ల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు

8 Sep, 2015 17:45 IST|Sakshi

వర్ని (నిజామాబాద్) :  తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు, దళితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్నిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించింది. దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అలాగే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు.

మరిన్ని వార్తలు