10న యువ కవి సమ్మేళనం

9 Oct, 2019 08:31 IST|Sakshi
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న భూపతి వెంకటేశ్వర్లు తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాహితి, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 10న సుద్దాల హనుమంతు యాదిలో ‘నల్లమల యురేనియం తవ్వకాలపై యువ కవి సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ సాహితి ప్రతినిధులు భూపతి వెంకటేశ్వర్లు, జి.నరేష్, డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు విప్లవ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు