కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జెడ్పీ చైర్ పర్సన్

27 Feb, 2015 16:07 IST|Sakshi

వరంగల్: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం సరిగ్గా ఉందా లేదా అని విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. సాంబారులో ఎండిన కూరగాయలు, పుచ్చులు ఉండటంపై వంటమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల పర్యవేక్షణ సరిగా లేనందుకు స్పెషల్ ఆఫీసర్ సాయిలక్ష్మీని మందలించారు.

(ఏటూరునాగారం)

మరిన్ని వార్తలు