ఇంట్లో పేలుడు: 10 మంది సజీవ దహనం

17 Aug, 2015 11:33 IST|Sakshi

కాబుల్:  ఆప్ఘనిస్తాన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10మంది సజీవ దహనమయ్యారు. హెరాత్ నగరంలో ఈ దుర్ఘటన  చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కాబుల్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో మంటలు వ్యాపించటంతో ఇల్లంతా పూర్తిగా కాలిపోయింది.

మరిన్ని వార్తలు