లోయలో పడిన బస్సు: 10 మంది మృతి

17 Feb, 2015 07:21 IST|Sakshi

జబువా: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని మచలియా ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి రాజస్థాన్ లోని గాలియకోట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు