శ్రీలంకలోని మధ్య బందర్వాలా కొండ ప్రాంతంలో గత రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి అజిత్ రోహన్ మంగళవారం వెల్లడించారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు. బస్సు కొండపై నుంచి కిందకి వస్తున్న క్రమంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.
వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండటం వల్ల ఆ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు. అయితే అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు చేపట్టలేకపోయామని అజిత్ రోహన్ వెల్లడించారు.