ఆహారం వికటించి 10 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

8 Aug, 2015 23:25 IST|Sakshi

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ వసతి గృహంలో ఆహారం వికటించి 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శనివారం ఉదయం విద్యార్థులకు పులగం, చట్నీ వడ్డించారు. అనంతరం విద్యార్థులకు వాంతులు, కడుపులో నొప్పి, జ్వరంతో అస్వస్థత పాలయ్యారు. అందులో ఒక విద్యార్థికి రాత్రయ్యే సరికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ రావడంతో కర్నూలుకు తరలించారు.

మరిన్ని వార్తలు