తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా

29 Jul, 2014 13:04 IST|Sakshi
తమ్ముడి ప్రాణం తీసిన అన్నయ్య సరదా

ఫిరోజాబాద్: అన్నయ్య సరదా తమ్ముడి ప్రాణం తీసింది. సోదరుడి చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలి 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది. రామ్గఢ్ ప్రాంతంలోని రాపూరాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మూడో తరగతి చదువుతున్న పంకజ్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. లోడ్ చేసివున్న తుపాకీని పంకజ్ సోదరుడు యశ్వంత్ సింగ్ సరదా పేల్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బుల్లెట్ ఛాతిలో దిగడంతో పంకజ్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తుపాకీ అక్రమమైందని చెప్పారు. యశ్వంత్ సింగ్ పై 304 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు