తిరువనంతపురం : కేరళకు చెందిన 17 మంది యువతీ యువకులు తీవ్రవాద సంస్థ ఐసిస్లో చేరి ఉంటారని వార్తలు రావడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం దర్యాప్తునకు ఆదేశించింది. ఉన్నత చదువుల కోసం పశ్చిమాసియా దేశాలకు వెళ్లిన వారి జాడ నెల నుంచి తెలియడంలేదని కుటుంబ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగుచూసింది. తప్పిపోయిన వారిలో 8 నెలల గర్భిణి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.
కొందరు ఇంజినీరింగ్, వైద్య విద్యను అభ్యసించారు. వీరు ఐసిస్లో చేరారని కచ్చితంగా చెప్పలేమని, వీరి కుటుంబాలు అందించిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు డీజీపీ లోక్నాథ్ తెలిపారు.