యూరప్లో మాయమై అర్జెంటీనాలో తేలింది

24 Apr, 2015 17:30 IST|Sakshi
యూరప్లో మాయమై అర్జెంటీనాలో తేలింది

బ్యూనస్ ఎయిర్స్: పద్దినెమిదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పుస్తకం ఒకటి రోమ్లో చోరీకి గురై ఏడాది తర్వాత దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనాలో బయటపడింది. ఈ పుస్తకం సెయింట్ పీటర్ బాసిలికాకు చెందినది.

1748 సంవత్సరానికి చెందిన ఈ పుస్తకాన్ని రోమ్లోని ఓ ప్రైవేటు లైబ్రరీ నుంచి కొందరు వ్యక్తులు దొంగిలించారు. దీంతో ఆ లైబ్రరీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏడాది నుంచి దాని కోసం వెతుకుతున్నారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ స్టోర్లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ఆన్లైన్ వేలంలో రూ.2,31,000 పలుకుతోంది. 

మరిన్ని వార్తలు