బస్సు - ట్రక్ ఢీ : 21 మంది మృతి

19 May, 2015 09:43 IST|Sakshi

నాంపెన్ : కంబోడియా స్వే రింగ్ ప్రావెన్స్లో మంగళవారం బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులంతా గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులని పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగాతోపాటు నిర్లక్ష్యంగా నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు