యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం!

23 Jun, 2016 17:11 IST|Sakshi
యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం!

పట్నా: బిహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతిని తుపాకీ బెదిరించి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత కిరాతకంగా ఆమె ప్రైవేటు అంగాల్లో పిస్టోల్, చెక్కముక్కలను దూర్చారు. ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

మోతిహరి జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ప్రధాన నిందితుడు సమీవుల్లా గతంలో బాధితురాలిపై అత్యాచారం జరిపి.. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో అతనిపై బ్లేడుతో బాధితురాలు దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెపై కిరాతకంగా అత్యాచారం జరిపాడు. ‘అతడు నన్ను కొట్టి అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులు కూడా నాపై లైంగిక దాడి చేశారు’ అని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని, తాము పేదవాళ్లం కావడంతో కేసు వాపసు తీసుకోవాలని నిందితుడి కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి తెలిపాడు.
 

మరిన్ని వార్తలు