శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో భద్రతదళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కుప్వారా జిల్లా హంద్వారా సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. కాగా ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డారు.
మంగళవారం హంద్వారా సెక్టార్లోనే భద్రతదళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగడమిది రెండోసారి. రాత్రి కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.