విమానాశ్రయం బాత్‌రూమ్‌లో 4.5 కిలోల బంగారం

4 Aug, 2015 22:51 IST|Sakshi

శంషాబాద్: విమానాశ్రయంలో నాలుగున్నర కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులు కస్టమ్స్ అధికారులు చేపడుతున్న తనిఖీలకు బయపడి విమానాశ్రయంలోని బాత్‌రూంలో లగేజీతో సహా బంగారాన్ని విడిచి వెళ్లిపోయారు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు