సాక్షి, హైదరాబాద్/బెంగళూరు, న్యూస్లైన్: మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దగ్ధం కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు బెంగళూరులో మరో నలుగురిని గురువారం అరెస్టు చేశా రు. వీరిని హైదరాబాద్కు తరలించినట్లు తెలుస్తోం ది. అరెస్టు అయిన వారిలో అక్రం, షబ్బీర్, అమానుల్లా షరీఫ్, మహ్మద్జ్రాక్ ఉన్నారు. వీరు జబ్బార్ ట్రావెల్స్ యాజమాన్యానికి సన్నిహితులని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు టికెట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, దుర్ఘటన రోజున బెంగళూరులో ఆ బస్సుకు ఎక్కువ టికెట్లు అమ్మింది వీరేనని సమాచారం.