రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 400 వాష్‌బేసిన్లు

12 Aug, 2015 17:18 IST|Sakshi

అరకులోయ(విశాఖపట్టణం జిల్లా): విశాఖ జిల్లా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 400 వాష్‌బేసిన్లు నిర్మించనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని అరకులోయలో రెండు ఆర్వో మంచి నీటి ఫ్లాంట్లు, 4 వాష్‌బేషిన్లు నిర్మించి, ప్రారంభించారు. శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా 49 వాష్‌బేసిన్లు ఏర్పాటు చేయనున్నామని రోటరీక్లబ్ సభ్యులు వడ్లమాని రవి, సూర్యారావులు తెలిపారు.

ఒక్కో వాష్‌బేషిన్‌లో 16ట్యాప్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ వాష్‌బేసిన్లు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, హైస్కూల్స్‌లో నిర్మిస్తామని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు