ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం

27 Sep, 2013 09:03 IST|Sakshi

ముంబయి : ముంబయిలో మరో భవనం కుప్పకూలింది. డాక్యార్డ్ రోడ్డు సమీపంలోని పురాతన అయిదు అంతస్తులు భవనం ఈరోజు ఉదయం ఆరున్నర ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదిహేనుమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 15 బృందాలతో సహాయక సిబ్బంది జెసిబీల సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40మంది వరకూ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.

ముంబయిలో బహుళ అంతస్తుల భవనాలు కూలిన ఘటనలు ఈ ఏడాదిలో ఇది మూడవది. ఏప్రిల్ 4న ఏడంతస్తుల భవనం కూలి 76మంది,  జూన్ 10న అయిదంతస్తుల భవనం కూలి  మరో 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు