ఆరు జనతాపార్టీల విలీనం నేడే

15 Apr, 2015 12:06 IST|Sakshi

ఢిల్లీ:   ఎస్పీ అధినేత ములాయం సింగ్ నేతృత్వంలో జనతా పరివార్కు చెందిన  ఆరు పార్టీల విలీనం  బుధవారం జరగనుంది. ములాయం నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌జేటీ, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఐన్‌ఎల్‌డీ పార్టీల భేటీ జరగనుంది.  బీహార్  ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శరద్ యాదవ్, కేసీ త్యాగి, హెచ్డి దేవెగౌడ, లాలూ ప్రసాద్, కమల్ మొరార్క, దుష్యంత్  చౌతాల,రాంగోపాల్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు.  ఈ సమావేశంలో కొత్త కూటమి పేరు, గుర్తును ఖారారు చేసే అవకాశం ఉంది. కొత్త పార్టీకి సమాజ్‌వాదీ జనతా పార్టీ లేదా సమాజ్‌వాదీ జనతాదళ్ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నూతన పార్టీకి సైకిల్ గుర్తును నిర్ధారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు