మాజీ రక్షణ సిబ్బంది పెన్షన్‌కు ఆధార్‌ ఉండాల్సిందే

9 Mar, 2017 03:22 IST|Sakshi

న్యూఢిల్లీ: పెన్షన్‌ పొందేందుకు మాజీ రక్షణ సిబ్బంది, కుటుంబీకులకు ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ రక్షణమంత్రిత్వ శాఖ నిర్ణయంతీసుకుంది. వీరంతా జూన్‌ 30లోపు ఆధార్‌కు నమోదుచేసుకోవాలని రక్షణ శాఖ ప్రకటించింది.

25 లక్షల మంది పెన్షన్‌ లబ్దిదారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని బుధవారం విడుదలచేసిన ఓ నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. ఇంతవరకు ఆధార్‌ నంబర్‌ సమర్పించని, ఆధార్‌ కార్డు లేనివారు ఇకపై తప్పకుండా ఆధార్‌ కోసం నమోదు చేసుకోవాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు