గుజరాత్ కు రెండు విమాన సర్వీసులు

10 Sep, 2014 22:48 IST|Sakshi

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు రెండు అంతర్జాతీయ విమానాలు సర్వీసులు దక్కాయి. అహ్మదాబాద్-లండన్, సూరత్- దుబాయ్  అంతర్జాతీయ విమానాలకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆమోదం తెలిపింది.

ఏఏఐ చైర్మన్ ఎస్ రహేజాతో అహ్మదాబాద్ లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి సౌరభ్ పటేల్ సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో గుజరాత్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు