గతేడాది నవంబర్లో కిడ్నాప్కు గురైన సర్వే ఇంజనీర్ దీప్ మండల్ను ఈ రోజు ఉదయం తీవ్రవాదులు విడిచిపెట్టారని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. మండల్ను మీజోరాం -బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వదిలిపెట్టారన్నారు. అయన్ని ఐజ్వాల్కు తీసుకువచ్చి, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మండల్ నోయిడాకు చెందిన టెల్ఫోన్ కంపెనీలో సర్వే ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
గతేడాది నవంబర్ 23న మండల్తోపాటు మరో ఇద్దరు డ్రైవర్లను మీజోరాం మమిట్ జిల్లాలోని తుయిపూయిబరి ప్రాంతంలో ఎన్ఎల్ఎఫ్టీ తీవ్రవాదులు అపహరించుకుపోయారు. నగదు చెల్లిస్తే కానీ వారిని వదిలేది లేదని తీవ్రవాదులు స్పష్టం చేశారు. ఆ క్రమంలో టెలిఫోన్ కంపెనీ రంగంలోకి దిగి,సిబ్బందిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని మీజోరాం ప్రభుత్వాన్ని కోరింది. దాంతో ప్రభుత్వం రంగంలోకి దిగి సంప్రదింపులు చేపట్టింది.ఈ ఏడాది జనవరి 21న ఇద్దరు డ్రైవర్లను కిడ్నాపర్లు విడిచిపెట్టారు. ఆదివారం ఉదయం మండల్ను విడుదల చేశారు.