తండ్రీ కూతుళ్లపై యాసిడ్ దాడి

9 Sep, 2015 12:30 IST|Sakshi
తండ్రీ కూతుళ్లపై యాసిడ్ దాడి

ముజఫర్ నగర్: తండ్రీ కూతుళ్లపై యాసిడ్ దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కూతురుపై అత్తమామలు పెడుతున్న గృహహింసకు సంబంధించిన కేసు విషయంలో వాళ్లిద్దరూ కోర్టుకు వెళ్లొస్తుండగా మార్గం మధ్యలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం వారిని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం ఇప్పిస్తున్నారు. గుల్షాన్ అనే 30 మహిళను గత కొద్ది రోజులుగా భర్త సత్ బీర్ అతడి తల్లిదండ్రులు కట్నం పేరిట ఇబ్బంది పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె తండ్రి రహీస్ అహ్మద్, కూతురు గుల్షాన్ వారిపై కేసు పెట్టారు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ అత్తమామలు, భర్త తెగ ఇబ్బందులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్లి వస్తున్నవారిపై కవాల్ అనే గ్రామం వద్ద యాసిడ్ దాడి జరిపించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు