చిన్నారులను పరామర్శించిన అల్లు అర్జున్

1 Jul, 2015 16:38 IST|Sakshi
చిన్నారులను పరామర్శించిన అల్లు అర్జున్

హైదరాబాద్: తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు. ఎమ్ఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు కేన్సర్ చిన్నారులను అల్లు అర్జున్ బుధవారం కలుసుకుని ముచ్చటించారు. గంట పాటు ఆ చిన్నారులు అల్లు అర్జున్తో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వారి యోగ క్షేమాలను వైద్యులతోపాటు సదరు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆరుగురు చిన్నారులకు గిఫ్ట్లు అందజేశారు.

మేక్ ఏ విష్ అనే స్వచ్చంధ సంస్థ... ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల కోరికలను గుర్తిస్తుంది. అనంతరం వారి కోరికలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. గతంలో కూకట్ పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని జూ.ఎన్టీఆర్ కలవాలని ఉందని తన అకాంక్షను మేక్ ఏ విష్ ప్రతినిధుల ఎదుట వ్యక్తం చేసింది. దాంతో మేక్ ఏ విష్ సంస్థ ఆ చిన్నారి కోరికును తీర్చిన సంగతి తెలిసిందే. అలాగే హీరో పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవాలనుందని చెప్పిన కేన్సర్ చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ సంస్థ నెరవేర్చిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు