శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

8 Aug, 2015 10:32 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ర్ట మంత్రి కిమిడి మృణాళిని, కన్నడ నటుడు సుదీప్ లు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరు ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం సుదీప్ మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో ఎంతో ప్రశాంతత ఉంటుందని అన్నారు.

మరిన్ని వార్తలు