ఆప్ లోకి మరో ఎంపీ సతీమణి

19 Jul, 2016 15:25 IST|Sakshi
ఆప్ లోకి మరో ఎంపీ సతీమణి

న్యూఢిల్లీ : బీజేపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో బీజేపీ ఎంపీ సతీమణి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. ఇటీవలి పార్టీ బహిష్కరణకు గురైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఝా ఆప్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా డీడీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ బహిరంగంగా విమర్శలు  చేయటంతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన భార్య బీజేపీని వీడి ఆప్లో చేరనున్నట్లు వచ్చిన వార్తలను కీర్తీ ఆజాద్ ఖండించలేదు. పైగా తన భార్య నిర్ణయంపై మీడియా విపరీత అర్థాలు తీయవద్దన్నారు. పార్టీ మారటం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఆయన తెలిపారు.  కాగా నవ్జోత్ సింగ్ సిద్ధూ ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన భార్య  నవ్జోత్ కౌర్ సిద్ధూ మాత్రం తాను బీజేపీలోనే ఉన్నారు. తాజాగా కీర్తీ ఆజాద్ బీజేపీలో ఉండగా, ఆయన భార్య మాత్రం ఆప్లో చేరబోతుండటం విశేషం.

మరిన్ని వార్తలు