విజయవాడ టు ఢిల్లీ: రోజుకో విమానం

3 Oct, 2016 21:59 IST|Sakshi
విజయవాడ టు ఢిల్లీ: రోజుకో విమానం

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియ ఇకపై ప్రతిరోజు విజయవాడ నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు అందించనుంది.  ప్రస్తుతం విజయవాడ నుంచి ఢిల్లీకి వారానికి ఐదు రోజుల పాటు ఎయిర్ ఇండియా విమాన సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే నవంబరు 1 నుంచి ప్రతిరోజూ సేవలు అందించనున్నట్టు పౌర విమానయాన శాఖ వర్గాలు సోమవారమిక్కడ తెలిపాయి.

అంతర్జాతీయ ప్రయాణికులు ముఖ్యంగా అమెరికా వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ విమాన సర్వీసును సాయంత్రం వేళ నడిపిస్తున్నారు. ఎరియిండియా ఫ్లయిట్ విజయవాడలో రాత్రి 8.40కి బయలుదేరి రాత్రి 10.55కి ఢిల్లీ చేరుకుంటుంది. అలాగే ఢిల్లీలో తెల్లవారుజామున 5.45 గంటలకు బయలుదేరి విజయవాడకు ఉదయం 8.00 గంటలకు చేరుకుంటుంది.

మరిన్ని వార్తలు