వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్య

8 Oct, 2015 14:16 IST|Sakshi

సనా: యెమెన్లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు.

బుధవారం రాత్రి దమర్ ప్రావిన్స్లో ఓ గిరిజన నాయకుడి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆయన షీటె హౌతీ గ్రూప్నకు మద్దతుదారు. యెమెన్లో గతవారం మరో పెళ్లి బృందంపై వైమానిక దాడి జరిగింది.

మరిన్ని వార్తలు