గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి మరణశిక్ష

24 Apr, 2015 15:35 IST|Sakshi

జమ్ము కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. తబిందా గని అనే అమ్మాయి 2007 సంవత్సరంలో స్కూలు నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, చంపేశారు.

ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించి దోషులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబసభ్యులు ఎప్పటినుంచో కోరుతున్నారు. నిందితులు సాదిక్ మీర్, అజర్ అహ్మద్ మీర్ ఇద్దరూ లాంగాటే ప్రాంతానికి చెందినవారు. మరో ఇద్దరు మోచి జహంగీర్ అన్సారీ పశ్చిమబెంగాల్కు చెందినవాడు కాగా, సురేష్ కుమార్ రాజస్థాన్ నివాసి.

మరిన్ని వార్తలు