బీజేపీని ముంచిన మిత్రపక్షాలు

9 Nov, 2015 03:03 IST|Sakshi

మిత్ర పక్షాల బలాన్ని అతిగా అంచనా వేసిన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంది. 159 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 53 స్థానాల్లో నెగ్గగా.. మిత్రపక్షాలు 84 స్థానాల్లో పోటీ చేసి ఐదే స్థానాల్లో నెగ్గాయి.  ఎల్జేపీకి బీజేపీ 40 సీట్లు ఇవ్వగా ఆ పార్టీ కేవలం 2 సీట్లు గెల్చుకుంది. మాజీ సీఎం జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్తానీ అవామ్ మోర్చాకు 21 సీట్లు కేటాయించగా.. ఒక్క స్థానంలోనే(మాంఝీ ఒక్కరే నెగ్గారు) గెలిచింది. ఇక కుష్వాహా నేతృత్వంలోని ఆర్‌ఎల్‌ఎస్‌పీ 23 సీట్లలో పోటీ చేసి రెండింట్లోనే గెలిచింది.

మరిన్ని వార్తలు