ప్రకటన సవరించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

20 Feb, 2014 16:09 IST|Sakshi
ప్రకటన సవరించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు సంబంధించి ఇచ్చిన నోటీస్ను డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ తప్పుగా చదివారు. ఆ తరువాత ఆయనే తప్పుగా చదివానని తన ప్రకటనను సవరించుకున్నారు.

 బిల్లుకు రాజ్యాంగ బద్ధతలేదని, దీనిపై సూచన చేస్తానంటూ  అరుణ్‌ జైట్లీ నోటీసు ఇచ్చారు. అయితే కురియన్ సభ్యులు ఇచ్చిన నోటీసులు చదివే సమయంలో అరుణ్‌ జైట్లీ బిల్లును వ్యతిరేకిస్తారని చెప్పారు.  ఆ తరువాత అరుణ్‌ జైట్లీ  ఇచ్చిన నోటీస్ను తాను తప్పుగా చదివానని  కురియన్ సభకు చెప్పారు.

మరిన్ని వార్తలు