నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసిన అనంత పోలీసులు

20 Aug, 2015 18:30 IST|Sakshi

అనంతపురం: పలుదొంగతనాల కేసులో నిందితులుగా ఉన్న నలుగుర్ని గురువారం అనంతపురం రెండో పట్టణ పోలీసులు బళ్లారి రోడ్డు వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 తులాల బంగారం, 8 మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

జల్సాలకు అలవాటు పడి వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిసింది. నిందితులు పెద్దన్న , దివాకర్, మహేశ్‌లను నాగముణీంద్రలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు