నిరశన దీక్షను విరమించుకున్న అన్నా

12 Sep, 2015 16:12 IST|Sakshi
నిరశన దీక్షను విరమించుకున్న అన్నా

ముంబై: మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న తలపెట్టిన నిరశన దీక్షను ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే విరమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గడం, మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అన్నా హజారే తెలిపారు.

భూసేకరణ బిల్లు ఉపసంహరణ, ఓఆర్ఓపీ విధానం అమలు డిమాండ్లతో అక్టోబరు 2న ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిరశన దీక్ష చేపట్టాలని అన్నా హజారే గతంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవడం అన్నా దీక్షను విరమించుకున్నారు. అన్నా తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధీలో ఈ విషయం చెప్పారు.

మరిన్ని వార్తలు