భారత్, నేపాల్లో మళ్లీ భూకంపం!

16 May, 2015 17:24 IST|Sakshi

భూకంపం వరుసపెట్టి వణికిస్తోంది. నేపాల్లో శనివారం సాయంత్రం మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, సిలిగురిలో కూడా స్వల్ప స్థాయిలోప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లో భూకంపం కారణంగా ఎంత నష్టం సంభవించిందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు