జేడీయూకు మరో షాక్
పట్నా: బిహార్ ఎన్నికల్లో అధికార జేడీయూకు మరో ఎదురుదెబ్బ. కిందటి నెలలో డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలపై ఓ మంత్రిని పార్టీనుంచి సస్పెండ్ చేసిన ఘటన మరువకముందే.. మరో జేడీయూ ఎమ్మెల్యే.. రెండు లక్షలు తీసుకుంటూ కెమెరాకు దొరికిపోయారు. ఎన్నికల్లో గెలిచాక వ్యాపారానికి సహకరిస్తాననని, ఎన్నికల ఖర్చుగా రూ. 5 లక్షలివ్వాలని.. ఓ వ్యాపారిని కుర్తా ఎమ్మెల్యే సత్యదేవ్సింగ్ తెలిసింది. ప్రస్తుతానికి రెండు లక్షలు తీసుకోవాలని గెలిచాక మిగతాది ఇస్తానంటూ.. ఆ వ్యాపారి డబ్బులిస్తున్నట్లుగా వీడియోలో రికార్డయింది.