2లక్షలు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే

26 Oct, 2015 02:36 IST|Sakshi

జేడీయూకు మరో షాక్
 
 పట్నా: బిహార్ ఎన్నికల్లో అధికార జేడీయూకు మరో ఎదురుదెబ్బ. కిందటి నెలలో డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలపై ఓ మంత్రిని పార్టీనుంచి సస్పెండ్ చేసిన ఘటన మరువకముందే.. మరో జేడీయూ ఎమ్మెల్యే.. రెండు లక్షలు తీసుకుంటూ కెమెరాకు దొరికిపోయారు.  ఎన్నికల్లో గెలిచాక వ్యాపారానికి సహకరిస్తాననని,  ఎన్నికల ఖర్చుగా రూ. 5 లక్షలివ్వాలని.. ఓ వ్యాపారిని కుర్తా  ఎమ్మెల్యే సత్యదేవ్‌సింగ్ తెలిసింది. ప్రస్తుతానికి రెండు లక్షలు తీసుకోవాలని  గెలిచాక మిగతాది ఇస్తానంటూ.. ఆ వ్యాపారి డబ్బులిస్తున్నట్లుగా వీడియోలో రికార్డయింది.

>
మరిన్ని వార్తలు