కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు

12 Aug, 2015 20:10 IST|Sakshi
కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు

ఓటుకు కోట్లు కేసులో నోటీసులు టెన్నిస్ కోర్టులో బంతిలా అటూ.. ఇటూ తిరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్రెడ్డికి తెలంగాణ ఏసీబీ బుధవారం నాడు నోటీసులు ఇవ్వడంతో.. అదే రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు డ్రైవర్కు, గన్ మన్కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్యను బెదిరించినట్లు వీరిద్దరిపైనా కేసు నమోదు చేశారు. దీంతో గన్ మన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు