త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!

19 Aug, 2015 18:02 IST|Sakshi
త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. బస్సు ఛార్జీలను10 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశముంది. ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు.

ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోందని సాంబశివరావు తెలిపారు. నష్టాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బయటపడాలంటే బస్సు ఛార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి విజయవాడ నుంచే ఏపీఎస్ ఆర్టీసీ పనిచేస్తుందని సాంబశివరావు చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు