బ్లూ బర్డ్ నుంచి ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫయర్లు

7 Oct, 2015 00:42 IST|Sakshi
బ్లూ బర్డ్ నుంచి ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫయర్లు

హైదరాబాద్: బ్లూ బర్డ్ కంపెనీ ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫయర్లను హైదరాబాద్ మార్కెట్లోకి తెచ్చింది. పూర్తిగా హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ ప్యూరిఫైయర్లను రూపొందించామని బ్లూ బర్డ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గృహ, వాణిజ్య అవసరాలనుకనుగుణంగా 15 రకాల మోడళ్లను అందిస్తున్నామని బ్లూ బర్డ్ ఎండీ, ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు.

వీటి ధరలు రూ.16,000 నుంచి రూ.60,000 రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. అత్యున్నత నాణ్యత గల ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించడమే తమ కంపెనీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వాటర్ ప్యూరిఫైర్లను అందిస్తున్నామని వివరించారు.
 

మరిన్ని వార్తలు