ఘోర బస్సు ప్రమాదం, 18 మంది మృతి

6 Mar, 2017 09:49 IST|Sakshi
రోడ్డు ప్రమాదం ఫైల్‌ ఫోటో

పనామా సిటీ: ఉత్తర అమెరికా దేశం పనామాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని పనామా సిటీకి నైరుతి దిశగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంటన్‌లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

బస్సులో 50 మందికి పైగా కూలీలను తీసుకెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే 16 మంది మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారని సివిల్‌ డిఫెన్స్ డైరెక్టర్‌ జోస్‌ డొండెరిస్‌ తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతుఉన్నామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు