-

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారిపై దాడి

1 Nov, 2016 20:37 IST|Sakshi
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారిపై దాడి

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా అధికారిపై మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. ఎయిరిండియా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌(45)పై బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు దాడి చేశారు. విమానాశ్నరయండిచివెళుతున్న ఆయనపై అకస్మాత్తుగా విరుచుకుపడి..  ఆయన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుదర్శన్‌ చేయి విరిగింది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌లోనే  ఇలాంటి దాడి జరుగడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.

మరిన్ని వార్తలు