పాపం.. కన్నకొడుకును దారుణంగా చంపాడు

25 Apr, 2017 15:23 IST|Sakshi
పాపం.. కన్నకొడుకును దారుణంగా చంపాడు

పట్నా: పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారి రెండేళ్ల కొడుకును కిరాతకంగా చంపేశాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపంతో గొంతు పిసికి చంపేసి ఇంటిదగ్గర ఉన్న మురికి కాలువలోకి విసిరేశాడు. బిహార్‌లోని పూర్ణియా జిల్లా బెలవాడన్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

మంగళ్‌ శర్మ (35) అనే వ్యక్తి దినకూలిగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు చిన్న కొడుకు ఆదర్శ్‌ కుమార్‌ (2) ఏడ్చాడు. కాసేపటి తర్వాత మంగళ్ శర్మ భార్య సులేఖ దేవి లేచి చూడగా చిన్న కొడుకు కనిపించలేదు. భర్తను ఈ విషయం అడగ్గా, సరైన సమాధానం చెప్పలేదు. అమెకు అనుమానం వచ్చి ఇంటి బయట చూడటంతో కాలువలో కొడుకు మృతదేహం కనిపించింది. సులేఖ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. తన భర్త మానసికంగా సరిగాలేడని ఆమె పోలీసులకు చెప్పింది. గత రెండు నెలలుగా అతను విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. ఈ కేసును త్వరితగతిన విచారణ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు