కిడ్నాప్ కేసులో పోలీసు అరెస్టు

11 Jun, 2015 19:51 IST|Sakshi

పాట్నా: రక్షణ బాధ్యతలు చూడాల్సిన పోలీసు అడ్డదారి తొక్కాడు. చివరికి అడ్డంగా బుక్కై అబాసుపాలయ్యాడు. బేడీలు వేయాల్సిన తానే చేతికి బేడీలు తగిలించుకున్నాడు. ఇంతకీ అతడు చేసిన నేరమేమిటని అనుకుంటున్నారా..! పాట్నాలో సునీల్ కుమార్ అనే వ్యాపారిని మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి దీపక్ కుమార్ అనే కానిస్టేబుల్ ఈ నెల 6న కిడ్నాప్ చేశారు. అనంతరం రూ.ఐదు లక్షలు ఇస్తేనే అతడిని వదిలేస్తామని వ్యాపారి కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా విచారణలో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దీంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి ఆరెస్టు చేశారు.    
 

మరిన్ని వార్తలు