మధ్యప్రదేశ్లో అధికార భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 230 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ సాధించింది. బీజేపీ 165 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాల్లో జయభేరి మోగించడం విశేషం. కాంగ్రెస్ 58 చోట్ల గెలిచి గత వైభవాన్ని కోల్పోయింది.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేసినా రెండు చోట్లా విజయకేతనం ఎగురవేశారు. బుధ్ని నియోజకవర్గం నుంచి దాదాపు 68 వేల ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేయగా, విదిశ నియోజకవర్గం నుంచి దాదాపు 17 వేల ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. చంబల్లోయలో ఆ పార్టీ తన హావా కొనసాగించింది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ కొనసాగుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 51 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అధివారం ఉదయం ప్రారంభమైంది. ఫలితాలు వెలువడే కొద్దీ బీజేపీ స్పష్టమైన మెజార్టీతో ఆధిక్యం కొనసాగించగా, కాంగ్రెస్ వెనుకంజలో నిలిచింది. కాంగ్రెస్ కు వరుసగా మూడో సారి నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్ శాసనసభకు నవంబర్ 25న ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 75 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.